అట్టహాసంగా ‘నమో వెంకటేశ’ శతదినోత్సవ వేడుక!
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై శ్రీనువైట్ల దర్శకత్వంలో వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్ గా నటించి విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న చిత్రం 'నమో వెంకటేశ". ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని జయభేరి క్లబ్ లో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ తో పాటు, క్యూట్ బేబీ త్రిష..హాస్యబ్రహ్యీ, దర్శకుడు శ్రీనువైట్ల, సంగీత దర్శకుడు దేవిశ్రీలతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.. ఈ వేడకకు డా. రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్ర నిర్మాతలకు చిత్ర శతదినోత్సవ షీల్డ్లను రామానాయుడు అందించగా మిగిలిన యూనిట్ సభ్యులకు దర్శకుడు, హీరోలు షీల్డులను అందచేశారు.
మంచి అహ్లాదవాతావరణంలో జరిగిన ఈ ఫంక్షన్ కు ఝాన్సీ యాంకర్ గా నిర్వహించగా తొలి చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు..మళ్లీ మరో సారి వెంకటేష్ తో సినిమా తీసి మీ ముందుకు వస్తామని వారు ఈ వేడుకలో తెలియజేశారు.


Click it and Unblock the Notifications











