Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెద్ద స్టార్ అయితే ఏంటి? మహేష్ బాబు కోర్టుకు రావాల్సిందే!
మహేష్ బాబును ‘శ్రీమంతుడు’ సినిమా కోర్టు చిక్కులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరోసారి మహేష్ బాబుకు సమన్లు జారీ అయ్యాయి.
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును 'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన కోర్టు చిక్కులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరోసారి మహేష్ బాబుకు సమన్లు జారీ అయ్యాయి.
మహేష్ బాబు పెద్ద స్టార్ అయినందున వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని పెట్టుకున్న పిటీషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. మహేష్ బాబు కోర్టు హాజరు కావాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది.
ఇంకా తెగని శ్రీమంతుడు కేసు
'శ్రీమంతుడు' చిత్రంపై నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను తన నవలను బేస్ చేసుకుని తీశారని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మళ్లీ విచారణ
ఈ కేసుకు సంబందించి గతంలో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేస్తూ, చిత్ర హీరోగా ఉన్న మహేష్ బాబు కూడా కోర్టు విచారణకు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో నిలిపివేత
ఈ కేసుకు సంబంధించి గతంలో..... మహేష్ బాబు, కొరటాల శివ కోర్టు హాజరు కావాలని ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించి నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే గడుపు ముగియడంతో నాంపల్లి కోర్టు నుండి మళ్లీ సమన్లు అందాయి.
ఆ కథ నాదే..
2012లో స్వాతి మాసపత్రికలో తాను 'చచ్చేంత ప్రేమ' అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్కు చెందిన రచయిత ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు.
కాపీ రైట్ చట్టం
కాపీరైట్ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని రచయిత పోరాడుతున్నారు.
మేము సినిమా తీసేలోపే
తానే రాసిన చచ్చేంత ప్రేమ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అవ్వడం.. సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయని శరత చంద్ర తెలిపారు.
ఎవరూ న్యాయం చేయలేదు
ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిలంతోపాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిశాము. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాలా మరో రచయితకు భవిష్యత్ తో ఇటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని రచయిత శరత్ చంద్ర గతంలో మీడియాతో అన్నారు.
ఎంతవరకైనా వెళతాం
ఈ విషయమై న్యాయం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని, తమ కథను కాపీ కొట్టడం విషయంలో 'శ్రీమంతుడు' దర్శకనిర్మాతల్ని సంప్రదించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం అటుంచి తమను ఎన్నో మాటలన్నారని శరత్ చంద్ర వాపోయారు.