Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొడుకుతో కలిసి బాలకృష్ణ రహస్య పూజలు.. కారణం ఏంటంటే!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కలిసి రహస్యంగా పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో వీరి పూజలు జరిగాయి. ఈ విషయం బయటకు రావడంతో బాలకృష్ణ ఇలా రహస్య పూజలు ఎందుకు చేశారనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. అయితే కొడుకు మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొస్తున్నారని, అందుకే బాలయ్య బాబు ఆ ఆలయానికి రావడం జరిగిందని సమాచారం అందుతోంది. పూర్తి వివారాలు చూస్తే..
పుల్లేటికుర్రులో ప్రత్యేక పూజలు
కుమారుడు మోక్షజ్ఞతో కలిసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామానికి వచ్చిన బాలకృష్ణ.. అక్కడి శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుడు కారుపర్తి నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి ఆధ్వర్యంలో పురోహితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, స్వామి వారికి రుద్రాభిషేకాలను నిర్వహించారు.
గోప్యంగా.. ఎవ్వరికీ అనుమతి ఇవ్వకుండా
బాలకృష్ణ, మోక్షజ్ఞ చేసిన ఈ పూజలు చాలా గోప్యంగా జరిగాయి. పోలీసులు బందోబస్తు నడుమ ఎవ్వరినీ ఆలయం లోకి ప్రవేశించనీయలేదు. కనీసం మీడియాను అనుమతించకుండా అత్యంత రహస్యంగా పూజా కార్యక్రమాలు చేశారు. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు.
గతంలో చాలాసార్లు.. అసలు కారణం ఏంటంటే
ఈ ఆలయంలో బాలకృష్ణ పూజలు చేస్తుండటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుండేవారు బాలయ్య. తన కొత్త సినిమా ముహూర్తానికి ముందు, సినిమా హిట్ అయ్యాక ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసమే ఈ సారి ఇద్దరూ కలిసి పూజ చేశారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య
ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేసిన బాలకృష్ణ.. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి.. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన తాజా సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.