twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకుతో కలిసి బాలకృష్ణ రహస్య పూజలు.. కారణం ఏంటంటే!

    |

    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కలిసి రహస్యంగా పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో వీరి పూజలు జరిగాయి. ఈ విషయం బయటకు రావడంతో బాలకృష్ణ ఇలా రహస్య పూజలు ఎందుకు చేశారనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. అయితే కొడుకు మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొస్తున్నారని, అందుకే బాలయ్య బాబు ఆ ఆలయానికి రావడం జరిగిందని సమాచారం అందుతోంది. పూర్తి వివారాలు చూస్తే..

     పుల్లేటికుర్రులో ప్రత్యేక పూజలు

    పుల్లేటికుర్రులో ప్రత్యేక పూజలు

    కుమారుడు మోక్షజ్ఞతో కలిసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామానికి వచ్చిన బాలకృష్ణ.. అక్కడి శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుడు కారుపర్తి నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి ఆధ్వర్యంలో పురోహితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, స్వామి వారికి రుద్రాభిషేకాలను నిర్వహించారు.

    గోప్యంగా.. ఎవ్వరికీ అనుమతి ఇవ్వకుండా

    గోప్యంగా.. ఎవ్వరికీ అనుమతి ఇవ్వకుండా

    బాలకృష్ణ, మోక్షజ్ఞ చేసిన ఈ పూజలు చాలా గోప్యంగా జరిగాయి. పోలీసులు బందోబస్తు నడుమ ఎవ్వరినీ ఆలయం లోకి ప్రవేశించనీయలేదు. కనీసం మీడియాను అనుమతించకుండా అత్యంత రహస్యంగా పూజా కార్యక్రమాలు చేశారు. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు.

    గతంలో చాలాసార్లు.. అసలు కారణం ఏంటంటే

    గతంలో చాలాసార్లు.. అసలు కారణం ఏంటంటే

    ఈ ఆలయంలో బాలకృష్ణ పూజలు చేస్తుండటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుండేవారు బాలయ్య. తన కొత్త సినిమా ముహూర్తానికి ముందు, సినిమా హిట్ అయ్యాక ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసమే ఈ సారి ఇద్దరూ కలిసి పూజ చేశారని తెలుస్తోంది.

    ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య

    ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య

    ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేసిన బాలకృష్ణ.. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి.. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన తాజా సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

    English summary
    Nandamuri fans are eagerly waiting to watch Mokshagna, the son of Natasimham Nandamuri Balakrishna on the big screen. Now Balakrishna and Mokshagna will participated on pooja in East Godavari district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X