Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆయనే పోలీసుల రూపంలో వచ్చి.. దిశా ఎన్కౌంటర్పై బాలకృష్ణ రియాక్షన్
Recommended Video
దిశా నిందితులు నలుగురినీ ఈ రోజు (డిసెంబర్ 6) తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో గత పది రోజులుగా దిశగా నిందితులను చంపేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్కి తెరపడింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దిశా ఘటన.. ఉలిక్కిపడ్డ జనం
నవంబర్ నెల 27వ తేదీన షాద్ నగర్ సమీపంలో దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఉదంతం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో దిశ ఘటనలో నిందితులైన ఆ నలుగురినీ బహిరంగంగా చంపేయాలని అంతా నినదించారు.
తప్పించుకునేందుకు ప్రయత్నం.. ఎన్కౌంటర్
ఈ పరిస్థితుల నడుమ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేడు (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది.
పోలీసులు, గవర్నమెంట్పై బాలకృష్ణ కామెంట్
ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోయపాటితో తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ దిశా ఎన్కౌంటర్ పై మీడియా ముఖంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్, పోలీసుల పనితీరుపై కామెంట్స్ చేశారు.
అతనే పోలీసుల రూపంలో వచ్చి..
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు.. అలాగే ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసి వెళ్లారని నమ్ముతున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి అని బాలకృష్ణ అన్నారు.
|
ఓ ఆడబిడ్డకు న్యాయం
దిశా కేసులో నిందితులైన ఈ నలుగురి ఎన్కౌంటర్తో ఓ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని బాలకృష్ణ అన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు అని బాల్లయ్యబాబు చెప్పారు.