Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆయనే పోలీసుల రూపంలో వచ్చి.. దిశా ఎన్కౌంటర్పై బాలకృష్ణ రియాక్షన్
Recommended Video
దిశా నిందితులు నలుగురినీ ఈ రోజు (డిసెంబర్ 6) తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో గత పది రోజులుగా దిశగా నిందితులను చంపేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్కి తెరపడింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దిశా ఘటన.. ఉలిక్కిపడ్డ జనం
నవంబర్ నెల 27వ తేదీన షాద్ నగర్ సమీపంలో దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఉదంతం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో దిశ ఘటనలో నిందితులైన ఆ నలుగురినీ బహిరంగంగా చంపేయాలని అంతా నినదించారు.
తప్పించుకునేందుకు ప్రయత్నం.. ఎన్కౌంటర్
ఈ పరిస్థితుల నడుమ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేడు (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది.
పోలీసులు, గవర్నమెంట్పై బాలకృష్ణ కామెంట్
ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోయపాటితో తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ దిశా ఎన్కౌంటర్ పై మీడియా ముఖంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్, పోలీసుల పనితీరుపై కామెంట్స్ చేశారు.
అతనే పోలీసుల రూపంలో వచ్చి..
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు.. అలాగే ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసి వెళ్లారని నమ్ముతున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి అని బాలకృష్ణ అన్నారు.
|
ఓ ఆడబిడ్డకు న్యాయం
దిశా కేసులో నిందితులైన ఈ నలుగురి ఎన్కౌంటర్తో ఓ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని బాలకృష్ణ అన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు అని బాల్లయ్యబాబు చెప్పారు.