20 ఏళ్ల మైల్ స్టోన్.. లోగో ఆవిష్కరించిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ సేవా కార్యక్రమాలు కంటికి ఎక్కువగా కనిపించవు. ప్రచారాల్లో ఎక్కడా వినిపించవు. చేసేదేదో చేస్తూనే ఉంటాడు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఎంతో మంది ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు బాలయ్య. సహృదయంతో మొదలు పెట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఇరవై యేళ్లు నిండాయి. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు.

జూన్ 22, 2000వ సంవత్సరంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం కాగా ఇంకో రెండు రోజుల్లో ఇరవై యేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. 'ఈ రోజు నేను, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ అయిన జేఎస్ఆర్ ప్రసాద్, మతుకుమిలి భరత్ ఇరవై యేళ్లు అవుతున్న సందర్భంగా లోగోను ఆవిష్కరించాం.

Nandamuri Balakrishna Unveiled 20 years of excellence in cancer care

ఈ హాస్పటల్ నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఇది మా అందరికి గుర్తిండిపోయే మైల్ స్టోన్'అని బాలయ్య పోస్ట్ చేశాడు. ప్రతి ఏడాది బాలయ్య తన పుట్టిన రోజు వేడుకలను ఈ హాస్పిటల్‌లోనే జరుపుకుంటాడు. నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలకు నమస్కరించి.. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X