Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
తండ్రిని మోస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. అంతటి విషాదంలో కూడా!
నందమూరి కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. బుధవారం ఉదయం హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండరు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే వివాహ కార్యక్రమానికి బయలుదేరిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్య కామినేని ఆసుపత్రికి వెళ్లి హరికృష్ణ మృత దేహానికి నివాళులు అర్పించారు.
హరికృష్ణ పార్థివ దేహం
కొద్ది సేపటి క్రితమే హరికృష్ణ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. హరికృష్ణ భౌతిక కాయం ఉన్న అంబులెన్స్ వెంట ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చారు. అంబులెన్స్ ని వెంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చారు.
అంతటి విషాదంలోనూ
అంబులెన్స్ ఇంటికి చేరుకున్న తరువాత ఎన్టీఆర్ ముందుగా దిగాడు. అక్కడ ఉన్న జనాభాని పక్కకు జరుపుతూ అంబులెన్స్ కు దారి ఇచ్చే ప్రయత్నం చేశాడు. గుండెల్లో కొండంత విషాదం ఉన్నా తండ్రికి తదుపరి జరగాల్సిన కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ చొరవ తీసుకున్నాడు.
తండ్రిని మోస్తూ
అంబులెన్స్ ఇంటికి చేరుకున్న తరువాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ తండ్రి భౌతిక కాయాన్ని స్వయంగా మోస్తూ తీసుకుని వెళ్లారు. పెద్ద ఎత్తున నందమూరి, టిడిపి అభిమానులతో హరికృష్ణ నివాసం ఉన్న ప్రాంతం జనసంద్రంగా మారింది.
అంత్యక్రియలు అక్కడే
పెద్ద కుమారుడు జానకి రామ్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే హరికృష్ణ అంత్యక్రియలు కూడా రేపు జరగనున్నాయి. ఏఅధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులని ఆదేశించారు.