Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తండ్రిని మోస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. అంతటి విషాదంలో కూడా!
నందమూరి కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. బుధవారం ఉదయం హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఇలాంటి విషాదకర వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండరు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే వివాహ కార్యక్రమానికి బయలుదేరిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్య కామినేని ఆసుపత్రికి వెళ్లి హరికృష్ణ మృత దేహానికి నివాళులు అర్పించారు.
హరికృష్ణ పార్థివ దేహం
కొద్ది సేపటి క్రితమే హరికృష్ణ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. హరికృష్ణ భౌతిక కాయం ఉన్న అంబులెన్స్ వెంట ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చారు. అంబులెన్స్ ని వెంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చారు.
అంతటి విషాదంలోనూ
అంబులెన్స్ ఇంటికి చేరుకున్న తరువాత ఎన్టీఆర్ ముందుగా దిగాడు. అక్కడ ఉన్న జనాభాని పక్కకు జరుపుతూ అంబులెన్స్ కు దారి ఇచ్చే ప్రయత్నం చేశాడు. గుండెల్లో కొండంత విషాదం ఉన్నా తండ్రికి తదుపరి జరగాల్సిన కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ చొరవ తీసుకున్నాడు.
తండ్రిని మోస్తూ
అంబులెన్స్ ఇంటికి చేరుకున్న తరువాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ తండ్రి భౌతిక కాయాన్ని స్వయంగా మోస్తూ తీసుకుని వెళ్లారు. పెద్ద ఎత్తున నందమూరి, టిడిపి అభిమానులతో హరికృష్ణ నివాసం ఉన్న ప్రాంతం జనసంద్రంగా మారింది.
అంత్యక్రియలు అక్కడే
పెద్ద కుమారుడు జానకి రామ్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే హరికృష్ణ అంత్యక్రియలు కూడా రేపు జరగనున్నాయి. ఏఅధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులని ఆదేశించారు.