Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హరికృష్ణ సంవత్సరీకం... కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్కు బాబు పరామర్శ
దివంగత నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ సంవత్సరీకం ఆదివారం హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు.
సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో ఆగస్టు 29, 2018న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. హరి మరణం అభిమానులతో పాటు, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.
తండ్రి హరికృష్ణ హస్తికలను గతేడాది అక్టోబర్ 30న కృష్ణా నదిలో నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద గల కృష్ణా తీరంలో వేదపండితుల సంక్షమంలో ఈ తంతు నిర్వహించారు.
జూ ఎన్టీఆర్ గతేడాది 'అరవింద సమేత' షూటింగ్ మధ్యలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమా షూటింగ్ కొంతకాలం షూటింగ్ వాయిదా వేయాలని ప్రయత్నించారు. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని, తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదు రోజులకే చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్.
ఆ తర్వాత జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ తన మనసులో ఉన్న దుఃఖాన్నంతా వెల్లగక్కారు. ఈ సంఘటన వల్ల సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదేమో? అనుకున్నారు. కాని వృత్తి ధర్మం ఎప్పుడు మరిచిపోకూడదని మా తాతగారు మా నాన్నగారికి చెప్పారు. మా నాన్న గారు మాకు అదే చెప్పారు. రేపటి రోజున మా పిల్లలుకు కూడా మేం ఇదే నేర్పిస్తామని ఎన్టీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.