Don't Miss!
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం.. పాడె మోసిన చంద్రబాబు!
నందమూరి హరికృష్ణ అంత్యక్రియల్లో భాగంగా అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు సాగగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు హరికృష్ణ పాడెని మోశారు. ఇంటి నుంచి హరికృష్ణ భౌతిక కాయం ఉన్న పాడెని అంతిమ యాత్రకు సిద్ధం చేసిన వాహనం వరకు మోశారు .
కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. వాహనం వెంట కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వెళుతున్నారు. చంద్రబాబు కూడా వాహనం వెంట వెళ్లనున్నారు.
బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ రాజకీయా నాయకుడిగా, సినీ నటుడిగా మంచి ఖ్యాతిని పొందారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తోంది. హరికృష్ణ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర మెహిదీపట్నం, టోలి చౌకి, నారాయణమ్మ కాలేజ్, విష్పర్ వాలి మీదుగా జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానం వరకు సాగనుంది.