Don't Miss!
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'ఎంత మంచి వాడవురా'.. బాబాయ్ హీరోయిన్తో కళ్యాణ్ రామ్ చిందులు
బాబాయ్ నందమూరి బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్తో కళ్యాణ్ రామ్ చిందులేస్తున్నాడు. అది కూడా ఐటెం సాంగ్లో. గత వారమే ఈ సాంగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాలో ఈ సాంగ్ థియేటర్స్ని హోరెత్తించనుంది.
బాలకృష్ణ హీరోగా వచ్చిన జైసింహా సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నటాషా దోషి. ఈ అమ్మడితోనే ఇప్పుడు అబ్బాయ్ చిందులేస్తున్నాడు. 'ఎంత మంచి వాడవురా' సినిమాలో ఈ ఐటెం సాంగ్ హైలైట్ కానుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.
సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథా చిత్రం 'ఎంత మంచి వాడవురా'. ఉమేష్ గుప్త సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది 17 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
గత చిత్రాల పరంగా చూస్తే ఇటు కళ్యాణ్ రామ్కి, అటు సతీష్ వేగేశ్నకు ఈ సినిమా ఎంతో ఇంపార్టెంట్ మూవీ. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దూరమవుతోన్న మానవ సంబంధాలను ఎలివేట్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. సంక్రాంతి కానుకగా 'ఎంత మంచి వాడవురా' సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు.