Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి చెప్పినట్లే...పూరీ జగన్నాధ్
రాజమౌళి నా చిత్రాన్ని చూసి రవితేజకు తప్పకుండా అవార్డు వస్తుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే రవితేజకు అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు నాకు వచ్చినట్లే ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్రానికి రచయితగా నాకు అవార్డు రావటం కూడా సంతృప్తినిచ్చింది అన్నారు పూరీ జగన్నాధ్. తనకు 2008 నంది అవార్డులలో నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా అవార్డు రావటానికి స్పందిస్తూ. అలాగే నేనింతే గురించి మాట్లాడుతూ..నేనింతే ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే సంతృప్తితో చేసాను. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా సినిమాల్లో ఏ సినిమాకీ రాని పేరు,ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. కష్టపడి పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ నేనింతే చిత్రాన్ని చూసి ఎంతో ఇన్ స్పెయిర్ అయ్యారు. కొన్ని విద్యా సంస్ధల్లో పర్శనాలిటీ డెవలప్ మెంట్ విభాంగాలో ఈ చిత్రాన్ని పాఠంగా ప్రదర్శించారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను అన్నారు. ఇక ప్రభాస్ హీరోగా పూరి రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ వారం రిలీజ్ కానుంది.