Don't Miss!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజమౌళి చెప్పినట్లే...పూరీ జగన్నాధ్
రాజమౌళి నా చిత్రాన్ని చూసి రవితేజకు తప్పకుండా అవార్డు వస్తుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే రవితేజకు అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు నాకు వచ్చినట్లే ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్రానికి రచయితగా నాకు అవార్డు రావటం కూడా సంతృప్తినిచ్చింది అన్నారు పూరీ జగన్నాధ్. తనకు 2008 నంది అవార్డులలో నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా అవార్డు రావటానికి స్పందిస్తూ. అలాగే నేనింతే గురించి మాట్లాడుతూ..నేనింతే ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే సంతృప్తితో చేసాను. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా సినిమాల్లో ఏ సినిమాకీ రాని పేరు,ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. కష్టపడి పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ నేనింతే చిత్రాన్ని చూసి ఎంతో ఇన్ స్పెయిర్ అయ్యారు. కొన్ని విద్యా సంస్ధల్లో పర్శనాలిటీ డెవలప్ మెంట్ విభాంగాలో ఈ చిత్రాన్ని పాఠంగా ప్రదర్శించారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను అన్నారు. ఇక ప్రభాస్ హీరోగా పూరి రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ వారం రిలీజ్ కానుంది.