twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి చెప్పినట్లే...పూరీ జగన్నాధ్

    By Srikanya
    |

    రాజమౌళి నా చిత్రాన్ని చూసి రవితేజకు తప్పకుండా అవార్డు వస్తుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే రవితేజకు అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డు నాకు వచ్చినట్లే ఫీలవుతున్నాను. అలాగే ఈ చిత్రానికి రచయితగా నాకు అవార్డు రావటం కూడా సంతృప్తినిచ్చింది అన్నారు పూరీ జగన్నాధ్. తనకు 2008 నంది అవార్డులలో నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా అవార్డు రావటానికి స్పందిస్తూ. అలాగే నేనింతే గురించి మాట్లాడుతూ..నేనింతే ఓ మంచి సినిమా చేస్తున్నాను అనే సంతృప్తితో చేసాను. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నా సినిమాల్లో ఏ సినిమాకీ రాని పేరు,ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. కష్టపడి పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరూ నేనింతే చిత్రాన్ని చూసి ఎంతో ఇన్ స్పెయిర్ అయ్యారు. కొన్ని విద్యా సంస్ధల్లో పర్శనాలిటీ డెవలప్ మెంట్ విభాంగాలో ఈ చిత్రాన్ని పాఠంగా ప్రదర్శించారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను అన్నారు. ఇక ప్రభాస్ హీరోగా పూరి రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ వారం రిలీజ్ కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X