Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'అలా మొదలైంది' దర్శకురాలి తదుపరి చిత్రం ఖరారు
అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీ రెడ్డి. తొలి చిత్రంతోనే క్రియోటివిటీ ఉన్న దర్సకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రం త్వరలో ప్రారంభించనుంది. ఈ చిత్రంలో హీరోగా సిద్దార్ధ ని ఖరారు చేసారు. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. కందిరీగ,కాంచన చిత్రాల విజయోత్సాహంలో ఉన్న బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని ఈ సంవత్సరాంతానికి షూటింగ్ ప్రారంబించనున్నారు. ఇక ఇంతకాలం ఏ చిత్రమూ ప్రారంబించకపోవటం కారణం నందినీ రెడ్డి స్క్రిప్టు మీద పూర్తిగా కూర్చుని ఉండటమే అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సిద్ద్రార్ద ...దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం నవంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సిద్ధార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. నేడు యువతలో ఉన్న కన్ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత మా సంస్థలో సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ఇది. అతను మంచి నటుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం శ్రుతిహాసన్ కొట్టేస్తుంది అంటున్నారు దిల్ రాజు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.