Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యాపీ న్యూ ఇయర్లో....హీరోయిన్ స్యాడ్ నిర్ణయం, ఇక విడాకులే!
న్యూఢిల్లీ: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ హ్యాపీ న్యూఇయర్ సంబరాలు ఇంకా ముగియక ముందే స్యాడ్ న్యూస్ చెప్పి అభిమానులకు షాకిచ్చింది. త్వరలో తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోనున్నట్లు ప్రకటించింది.
నందితా దాస్-శుభోద్ మస్కారా ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరి మధ్య రిలేషన్ కొంత కాలంగా సరిగా ఉండటం లేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ...'అవును నిజమే, త్వరలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం, ఈ విషయంలో మీడియా వారు మా ప్రైవసీకి భంగం కలిగించ వద్దని ఆమె తెలిపారు.
'విడిపోవడం అంటే అంత ఈజీ కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మాకు మా కుమారుడిని భవిష్యత్తు ముఖ్యం. విడిపోయినా కుమారుడి భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.
నందితా దాస్ వయసు 47 సంవత్సరాలు. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్ 2007లో విడాకులు తీసుకున్నారు. 2010లో శుభోద్ మస్కారాను వివాహం చేసుకున్నారు. లీవుడ్లో ఫైర్, ఎర్త్, బవందర్ లాంటి మీనింగ్ ఫుల్ సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన 'ఫిరాఖ్' మూవీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.