Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని 'భీమిలి కబడ్డీ జట్టు' ఏం చేస్తోంది?
తమిళంలో హిట్టయిన వెన్నెల కబడ్డి కూటం చిత్రాన్ని తెలుగులో 'భీమిలి కబడ్డీ జట్టు' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని, శరణ్యామోహన్, కీర్తన, కిషోర్ ముఖ్య పాత్రలుగా మెగా సూపర్గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇక ఈ 'భీమిలి కబడ్డీ జట్టు' షూటింగు పూర్తిచేసుకుని, డబ్బింగ్ పనుల్ని జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ "దర్శకుడు సత్య ఓ చక్కని చిత్రంగా దీన్ని రూపొందించి, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత అతను పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు" అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ మొదటి వారంలో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామనీ, సెల్వగణేశ్ చాలా చక్కని సంగీతాన్ని అందించారనీ మరో నిర్మాత పరాస్ జైన్ చెప్పారు.