Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
తమిళ రీమేక్ రైట్స్ కొనుక్కున్న నాని
హైదరాబాద్ : హీరో నాని తనకు ఎలాంటి సినిమాలు నప్పుతాయో ఎంచుకుని రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగా...తమిళ కామెడీ డ్రామా చిత్రం "పణియారం పద్మినియుమ్" రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఓ లాండ్ లార్డ్ కి అతని పద్మినికారు కి సంభందించిన కథ ఇది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా చేసారు. సినిమా రీసెంట్ గా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ ఓ కీలకమైన పాత్రలో చేస్తారని తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు.
ఇక నాని హీరోగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పైసా'. కేథరిన్ హీరోయిన్. ఈ నెల 7 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని నాని తెలిపారు. 'పైసా' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. మొదట ఈ చిత్రం పిభ్రవరి 14న ఈ చిత్రం విడుదల అన్నారు. కానీ విడుదల తేదీ మారనుంది. ఈ చిత్రం దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.
నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కుతున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 న విడుదల అవుతోంది.