Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ధూమ్-3’ థియేటర్లలో హీరో నాని మూవీ కూడా...
హైదరాబాద్: యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ బాలీవుడ్ మూవీ 'ధూమ్-3'. ఈ చిత్రం ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ సభ్యులు హైదరాబాద్ వచ్చారు. ప్రధాన తారాగణమైన అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. తెలుగు అనువాదంలోనూ ఈచిత్రం విడుదలవుతోంది.
యాష్ రాజ్ ఫిల్మ్ సంస్థ సౌత్లో నిర్మిస్తున్న తొలి సినిమా...నాని హీరోగా తెరకెక్కుతున్న తెలుగు మూవీ 'ఆహా కళ్యాణం'. హిందీలో సూపర్ హిట్ అయిన 'బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి ఇది రీమేక్. 'ఆహా కళ్యాణం' ఫస్ట్ లుక్ టీజర్ను 'ధూమ్-3'తో పాటే థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమానుల్లో ఒకరైన ఉదయ్ చోప్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు నానికి ఆఫర్ చేసినట్లు సమాచారం. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని, ఈగ సినిమా సూపర్ హిట్ అవడంతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను కూడా నానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం "జండా పై కపిరాజు", "పైసా" సినిమాలలో నటిస్తున్నాడు.
ఇక ధూమ్-3 సినిమా వివరాల్లోకి వెళితే....
ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్లపై చిత్రీకరించిన ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.
ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది.