Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా నటిగా... నన్నపనేని రాజకుమారి
ఇటీవలే ఆమెపై ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం నిర్మాణానంతర పనుల్లో భాగంగా ప్రస్తుతం రీరికార్డింగ్ శరవేగంగా జరుపుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఆడియో, జనవరిలో సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నామని చెప్పారు.
చిత్ర సమర్పకుడు దొరస్వామిరాజు మాట్లాడుతూ కథకు ప్రధాన్యమిస్తున్న చిత్రమిదని పేర్కొనగా, వినోదాత్మక కుటుంబ కథా చిత్రమని, ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులను అతరిస్తాయని దర్శకుడు ఉదయభాస్కర్ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కృష్ణుడు, అశోక్ కుమార్, వైజాగ్ ప్రసాద్, సన, చంటి తదితరులు తారాగాణం.
ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, ఛాయాగ్రహణం: శివరాంరెడ్డి, ఆర్ట్: విజయకృష్ణ, ప్రొ.కంట్రోలర్: పి.వి.శాస్త్రి, సమర్పణ: వి.దొరస్వామిరాజు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉదయ్ భాస్కర్ పి.
తారకరత్న ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు 'చూడాలని చెప్పాలని' చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో మాధవి లత హీరోయిన్ ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. అదే విధంగా తారకరత్న హీరోగా 'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.