Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్లో విషాదం.. టాప్ ప్రొడ్యూసర్ ఆకస్మిక మృతి
కొద్దిరోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కురు వృద్దులలో ఒకరైన ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్ కన్నుమూశారు. ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఎగ్జిబిషన్ ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆయన వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. నైజాం ఏరియాలో వన్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూటర్ లలో ఒకరిగా నారాయణ్ దాస్ నారంగ్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తెలుగులో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉంది.
అంతే కాక తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా నారాయణ్ దాస్ కె.నారంగ్ ఉన్నారు. ఇటీవల మహేష్ తో కలిసి AMB సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోని ఉత్తమ మల్టీప్లెక్స్ లలో ఒకటిగా నిలిచింది. మహేష్ .. అల్లు అర్జున్ సహా పలువురు స్టార్లతో కలిసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలోనూ నారంగ్ ఉన్నారు.
కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ నారంగ్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఏషియన్ మల్టీ ప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ చైన్ కు అధినేత కూడా. ఇక శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో లవ్ స్టొరీ, లక్ష్య సినిమాలను నిర్మించిన నారాయణ దాస్ కె నారంగ్ ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ సినిమా, ధనుష్ తో ఒక మల్టీ లింగ్యువల్ సినిమాని సుధీర్ బాబుతో ఒక సినిమా నిర్మిస్తున్నారు.
ఇక వీటితోపాటు తమిళ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ చేస్తున్న సినిమాలో కూడా ఆయన సహ నిర్మాతగా ఉన్నారు. వీరు కాకుండా టాలీవుడ్ హీరోలు శర్వానంద్, అడివి శేష్, నిఖిల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్ బాడిని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారి ఇంటికి సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించనున్నారు.