Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ గోపాల్ వర్మ వల్ల ఎనభై లక్షలు పోగొట్టుకున్నాను
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మరోసారి మాటల దాడి చేసారు నిర్మాత నట్టికుమార్.నిన్న సాయింత్రం ఓ పాపులర్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. అలాగే బాలీవుడ్లో బాల్థాకరే వంటి నాయకులపై సర్కార్ వంటి సినిమాలు తీసి అక్కడి బోర్ కొట్టించిన వర్మ ఇప్పుడు మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నాశనం చేసి పారేశారని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఏ ముహూర్తాన రక్తచరిత్ర అంటూ సినిమా మొదలుపెట్టారో కానీ, ఆ సినిమాలతోపాటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత సినీ పరిశ్రమలో ఎవరి పేరు ఏ రోజున వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని అన్నారు.
అలాగే వర్మ అంత పరమ నీచుడు, నికృష్టుడు ఎవరూ ఉండరనీ, తాను అసలు తెలుగు సినిమానే చేయననీ, తెలుగు ప్రేక్షకులు అంత ప్రతిభావంతులు కారని శపథం చేసి వెళ్లిన వర్మను మనం అక్కున చేర్చుకున్నామంటూ నట్టికుమార్ అన్నారు. హిందీలో పలు ప్లాప్ లు తీసి అక్కడ పబ్లిసిటీతో సేవ్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అడవి అనే చిత్రంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న తాను 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాననీ, అయితే ఆ తర్వాత చిత్రం తనకే ఇస్తానని చెప్పాడనీ, ఇప్పుడు "రక్త చరిత్ర" అడిగితే అది తన చేతుల్లో లేదని చేతులెత్తాశాడని నట్టి కుమార్ విమర్శించాడు. వర్మ జిమ్మిక్కులు ఆయనకే చెల్లుననీ, ఈ విషయమై ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకవెళ్లి ఆయనపై కంప్లైంట్ చేస్తానని నట్టికుమార్ తెలిపారు.
గుప్తశాస్త్రం వంటి సెక్స్ చిత్రంతో కెరీర్ ప్రారంబించిన నట్టికుమార్..ఈ పదేళ్లలో దాదాపు 56నిర్మించారు. అలాగే ఈ చిత్రం తర్వాత 'ఎ ఫిలిం బై అరవింద్" ఫేం శేఖర్ సూరి దర్శకత్వంలో డారాజశేఖర్ హీరోగా ఒక చిత్రం, నట్టికుమార్..అభిమాన హీరో శ్రీహరితో విజయన్ మాస్టర్ దర్శకత్వంలో మరో చిత్రం, పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్శంకర్తో మరో చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఆరు సినిమాలు నిర్మించాలన్నది నా లక్ష్యం అని చెప్తున్నారు.