Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలకృష్ణ చిత్రాన్ని ఉద్దేశించే నట్టికుమార్ అలా ప్రశ్నించారా?
షూటింగ్ లు ఆపేసిన సమయంలో కొన్ని చిత్రాలు విదేశాల్లో షూటింగ్ చేసుకొనేందుకు ఎందుకు అనుమతించారు? రీ రికార్డింగులు ఎందుకు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. వీటిపై మా సమావేశంలో చర్చిస్తామంటూ నిర్మాత నట్టికుమార్ మీడియాతో బుధవారం రాత్రి మాట్లాడారు. అయితే నట్టికుమార్ ఏ చిత్రాన్ని ఉద్దేశించి ఈ టాపిక్ ఎత్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సమ్మె జరుగుతున్న సమయంలో బాలకృష్ణ, దాసరి కాంబినేషన్ లో రూపొందుతోన్న పరమవీరచక్ర చిత్రం విదేశాల్లో పాటల షూటింగ్ జరుపుకుని వచ్చింది.దాంతో దాన్నే దృష్టిలో పెట్టుకుని అన్నారా లేక మరో చిత్రాన్ని ఉద్దేశించి అన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక బుధవారం...చలనచిత్ర కార్మికుల సమాఖ్య షూటింగులు చేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేసింది. ఈ మేరకు చలనచిత్ర వాణిజ్య మండలికి లేఖను అందజేశారు. వేతన సవరణపై హామీ రావడంతో సమ్మెను విరమించుకొంటున్నామనీ, గురువారం నుంచి షూటింగులకు హాజరవుతామని అందులో తెలిపారు. అయితే ఈ విషయమై తెలుగు చలనచిత్ర నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చించేందుకు గురువారం ఉదయం హైదరాబాద్లో నిర్మాతలు సమావేశం కాబోతున్నారు.