Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా పాలిటిక్స్: నట్టికుమార్ సంచనలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నిర్మాత నట్టి కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పెద్ద సినిమాల నిర్మాతలంతా కలిసి చిన్న నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మరోసారి గళం విప్పారు. చిన్న సినిమా పాలిట ఆ 14 మందే విలన్లని ఆరోపించారు. 1400 మంది నిర్మాతలున్న నిర్మాతల మండలిని వారే కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆ 14 మంది పెద్ద నిర్మాతల ఆధ్వర్యంలోనే నిర్మాతల మండలి నడవాలని అందరిపై ఒత్తిడి తెస్తున్నారని...వారి నిర్ణయాలు చిన్న నిర్మాతలను తీవ్రంగా నష్టపరిచే విధంగా ఉంటున్నాయని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిర్మాత సురేష్బాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలోని థియేటర్లన్నీ తన చేతుల్లోనే ఉన్నట్టుగా ఆయన శాసిస్తున్నారన్నారు.
రూ. 16 కోట్లతో ఉన్న కౌన్సిల్లో రూ. 5 కోట్లు కాజేశారని, మిగతా రూ. 11 కోట్లు కూడా కాజేసి చిన్న నిర్మాతలను రోడ్డున పడేయాలని ఆయన చూస్తున్నారని నట్టికుమార్ ఆరోపించారు. వారిపై 1400 మంది నిర్మాతలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందనారు.
కేవలం రెండు ఛానళ్లకే యాడ్స్ ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా నట్టి కుమార్ తప్పుబట్టారు. ఏ చానల్కు ప్రకటన ఇవ్వాలో నిర్మాత ఇష్టమని, ఇలాంటి అనవసరమైన విధానాలు తెచ్చి నిర్మాతల హక్కులకు భంగం కలిగిస్తున్న ఆ 14 మంది నిర్మాతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.