Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బద్రినాథ్’ఓపెనింగ్స్ కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణ
త్వరలో రిలీజవుతున్న'బద్రినాథ్"ఓపెనింగ్స్ కోసం థియేటర్ ఓనర్ల (ఎగ్జిబిటర్లు)పై ఆ సినిమా పంపిణీదారులు, నిర్మాతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, భారీ రేట్లకు టిక్కెట్లు అమ్మాలని ఆజ్ఞాపించారని చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నిర్మాత నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించారు.
దీనివల్ల అదే సమయంలో రిలీజయ్యే చిన్న సినిమాలన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు.అలాగే ముఖ్యంగా రాయలసీమలో ఒక రోజు 'బద్రినాథ్"షోకి థియేటర్నుంచి రూ.12-14లక్షలు రాబట్టు కోవాలని యోచిస్తున్నారు.
భారీగా రూ.500, రూ.600కి టిక్కెట్లు విక్రయించబోతున్నారని తెలిసింది. ఒక్క సినిమా కోసం 10సినిమాల పొట్టకొడుతున్నారు. ఇది అన్యాయం. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఈ విషయమై ఆలోచించాలి. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ రేట్లనే అమలు చేయాలి. అనధికారికంగా రేట్లు పెంచితే సంబంధిత థియేటర్ పరిధిలోని పోలీస్స్టేషన్లో ప్రజలు ఫిర్యాదు చేయాలి.
పెద్ద సినిమా చిన్న సినిమా పాలిట శాపం.భారీ సినిమా రిలీజవుతుం దంటే చాలు టిక్కెట్ల రేట్లు బాదేస్తున్నారు. అనధికారికంగా భారీ రేట్లు పెంచి జనాల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. దాంతో పెద్ద సినిమాలు భారీ వసూళ్లు దక్కించు కుని..చిన్న సినిమాను సర్వనాశనం చేస్తున్నాయి అన్నారు నట్టి కుమార్.