Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సినీ ఇండస్ట్రీలోకి మరో నిర్మాత వారసుడు
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత, విశాఖ టాకీస్ అధినేత నట్టి కుమార్ తనయుడు క్రాంతి సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. క్రాంతి పుట్టినరోజు సందర్భంగా నట్టి కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్మాతగా 62 చిత్రాలు నిర్మించాను. దర్శకుడిగా 8 చిత్రాలు రూపొందించాను. ఇకపై ఆ బాధ్యతల్ని నా కుమారుడు నట్టి క్రాంతికి అప్పగిస్తున్నాను.
సినిమాలపై అతనికున్న ప్యాషన్ను గుర్తించి అతనికి యు.ఎస్లో ప్రత్యేకంగా అక్టోబర్ నుంచి శిక్షణ ఇప్పించబోతున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. యుద్ధం, చట్టం, మా అన్నయ్య బంగారం చిత్రాలకు అసోసియేట్గా పనిచేసిన క్రాంతి ఐయామ్ రేప్డ్, ట్రూ లవ్, ఏజ్ అలెర్ట్ వంటి లఘు చిత్రాలు రూపొందించాడు.
క్రాంతి మాట్లాడుతూ...దర్శకత్వ శాఖలో సాంకేతిక పరమైన అంశాలపై శిక్షణ తీసుకుంటే తక్కువ బడ్జెట్లో సినిమాలు అద్భుతంగా తీయొచ్చు. అక్టోబర్లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకోవడం కోసం ఆమెరికా వెళుతున్నాను. వచ్చే ఏడాది మేలో నా దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తాను అన్నారు.