Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సురేష్ బాబు రౌడీయిజం..
సుమంత్ నటించిన 'బోణి" చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న సరస్వతి ఫిలింస్ ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నట్టికుమార్తోపాటు, నిర్మాతలు సంగిశెట్టి దశరధ, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. నట్టికుమార్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ సురేష్బాబు, ఏషియన్ ఫిలింస్ సునీల్ పరిశ్రమలో మాఫియా డాన్స్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ధియేటర్ల గుత్తాధిపత్యం తొలగిపోనంతవరకూ ఈ సమస్య పరిష్కారం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఇలాంటి విషయాలపై ప్రశ్నించినందుకు ఈ తరహా దాడి నాపై కూడా గతంలో జరిగింది. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని, ప్రోత్సహిస్తున్న వారిని అరెస్టు చేయాలి. అలాగే వీరు 172 కోట్లు సర్వీస్ టాక్స్ ఎగవేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ విషయమై మేము హోం మంత్రిని, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, చిరంజీవిని, పరిశ్రమ పెద్ద దాసరి నారాయణరావును కలసి పరిస్థితిని వివరించనున్నాం.
థియేటర్లపై గుత్తాధిపత్యం చేస్తున్న వారు వాటిని వదలకపోతే సినిమా నిర్మాణాన్ని ఆపాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం' అన్నారు. సంగిశెట్టి దశరథ, కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, డబ్బు కోసం మంచి పద్ధతులను కాలరాయడం మంచిది కాదని, చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి సినిమా పెద్దలు పెద్ద మనసు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.