Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
నక్సల్ గ(ద)ళం.( 'దళం'.. ప్రివ్యూ)
"ఉద్వేగభరితమైన ఉపన్యాసాలకు ఆకర్షితులై ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లు, అక్కడ ఏమీ చేయలేమని తెలుసుకున్నాక జనజీవన స్రవంతిలో కలుస్తారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్లకి అడవే నయం అనిపించిందా? జనంలో జీవం చూశారా? అనేదే ఈ చిత్రం కథ'. ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .
దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ... "దాదాపు మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ప్రతిరోజూ పేపర్లలో వస్తున్న వార్తలు, సంఘటనల స్ఫూర్తితో కథను సిద్ధం చేసుకున్నాను. అభ్యుదయ భావాలతో అడవిబాట పట్టిన కొందరు యువకులు సమాజ సంస్కరణ కోసం ఏం చేశారు? వారికి రాజకీయ నాయకుల నుంచి ఎదురైన సమస్యలేమిటి? తామనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా? 'దళం' సిద్ధాంతాలేమిటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఆద్యంతం ఆలోచింపజేసే సినిమా అవుతుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. నవీన్ చంద్ర, పియా బాజ్పాయ్, నాజర్, సాయికుమార్ కీలక పాత్రల్ని పోషించారు. సీతారామశాస్త్రి రాసిన పాట సినిమాకే హైలైట్ అవుతుంది.''.
నిర్మాత సుమంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలో విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్ నర్తించింది.
బ్యానర్:
మమ్ముత్
మీడియా
అండ్
ఎంటర్టైన్మెంట్
ప్రై.లిమిటెడ్
నటీనటులు:
నవీన్చంద్ర,
పియాబాజ్పేయ్,
కిషోర్,
అభిమన్యుసింగ్,
సాయికుమార్,
సుబ్బరాజు,
హర్ష,
పృధ్వి,
నాగేంద్రబాబు,
ప్రగతి
ప్రధాన
పాత్రలు
పోషించారు.
ఛాయాగ్రహణం:
సుధాకర్
యక్కంటి,
పాటలు
సీతారామశాస్త్రి,అనంత్
శ్రీరామ్,
సాహతి
సంగీతం:
జేమ్స్
వసంతన్.
ఎగ్జిక్యూటివ్
నిర్మాత:
జి.శ్రీకృష్ణ,
కథ,మాటలు,
స్క్రీన్ప్లే,
దర్శకత్వం:
జీవన్రెడ్డి.