Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హైదరాబాద్లో SVSC కంటే ‘నాయక్’ పై చేయి
హైదరాబాద్: ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీసు బరిలో పోటా పోటీగా దూకుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం కాగా, మరొకటి మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమా రికార్డులు, కలెక్షన్ల పరంగా పై చేయి సాధిస్తుంది అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.
తెలుగు సినిమాలకు మెయిన్ ఇన్కం సోర్స్ నైజాం ఏరియా. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఇక్కడ పోటీ పోటీగా ఎక్కువ థియేటర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే ఫైనల్గా 'నాయక్' చిత్రానికే ఎక్కువ థియేటర్లు దక్కాయి.
హైదరాబాద్
వ్యాప్తంగా
నాయక్
చిత్రానికి
తొలి
రోజు
110
స్క్రీన్లు
దక్కినట్లు
తెలుస్తోంది.
'సీతమ్మ
వాకిట్లో
సిరిమల్లె
చెట్టు'
చిత్రానికి
కేవలం
70
నుంచి
80
మధ్య
మాత్ర
థియేటర్లు
దక్కే
అవకాశం
కనిపిస్తోంది.
ఈ
రెండు
చిత్రాలను
నైజా
ఏరియాలో
ప్రముఖ
నిర్మాత
దిల్
రాజు
పంపిణీ
చేస్తున్నారు.
నాయక్
చిత్రానికి
దిల్
రాజు
కేవలం
డిస్ట్రిబ్యూటర్
మాత్రమే.
కానీ
'సీతమ్మ
వాకిట్లో
సిరిమల్లె
చెట్టు'
చిత్రానికి
స్వయంగా
నిర్మాత.
ఈనేపథ్యంలో
దిల్
రాజు
సవతి
ప్రేమ
చూపెట్టి
తన
సొంత
సినిమాను
ఎక్కువ
థియేటర్లు
కేటాయిస్తారనే
ప్రచారం
జరిగింది.
కానీ..... కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ప్రభావమో? లేక చరణ్ మేనమామ అల్లు అరవింద్ రంగంలోకి దూకి పావులు కదపడమో? తెలియదు కానీ, మొత్తానికి 'నాయక్' చిత్రం హైదరాబాద్ ఏరియాలో అత్యధిక థియేటర్లు దక్కించుకుంది. హైదరాబాద్ ఏరియాలో థియేటర్లు ఎక్కవగా దక్కాయంటే ఆ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.