Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంఘ విద్రోహ శక్తులపై రామ్ చరణ్ పోరాటం
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'నాయక్'.
'నాయక్' చిత్రంలోలో రామ్ చరణ్ సంఘ విద్రోహ శక్తులపై పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందే ఈచిత్రం స్క్రిప్టు, కథ మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం 'నాయక్' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
'నాయక్' ఇటు అభిమానులకు అటు సిని ప్రేమికులకు కన్నుల పండుగ కానుంది.ఈ చిత్రంలో పలు అందమయిన ప్రదేశాలను మరింత అందంగా కెమెరాలో బంధించి చూపించనున్నారు. రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద తెరకెక్కించిన 'శుభలేఖ రాసుకున్న' పాటను తొలిసారిగా స్లోవేనియాలో చిత్రీకరించారు. స్లోవేనియాలో చిత్రీకరించబడిన తొలి భారతీయ చిత్రం 'నాయక్' ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ కి మాత్రమే మన చిత్రాలు పరిమితమయ్యాయి.
ఆ సంగతి పక్కన పెడితే ఈచిత్రం స్టోరీ లీకైనట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాయక్ చిత్రంలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్గా ఇద్దరుంటారట, రామ్ ఏమో మాస్, చెర్రి ఏమో క్లాస్ ఇలా ఇద్దరుంటారట. రామ్ ఎప్పుడు గొడవలతో కొందరిని చంపుతుండగా రామ్ చేసిన హత్యలకు చెర్రీను పోలీసులు అరెస్ట్ చేస్తారట ఇది ఇంటర్వల్లో ట్విస్ట్ .. ఈ కేసులో చెర్రీను కోర్టులో ప్రవేశపెట్టి వాదోపవాదాలు విన్న తరువాత చెర్రీకు జడ్జీ శిక్ష విధిస్తుండగా రామ్ ఏంట్రీ ఇస్తాడట. ఇక్కడో ట్విస్ట్. రామ్ తనే ఈ హత్యలన్నీ చేశానని ఈ హత్యలతో చెర్రీకు ఏ సంబంధం లేదని ఒప్పుకుని లొంగిపోతాడట. ఇక సెకండాఫ్లో రామ్ ఆ హత్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తారిన అంటున్నారు.
మొత్తం మీదన నాయక్ చిత్రం మెగా అభిమానులు మెచ్చే పూర్తి కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందని, చాలా కాలంగా సరైన హిట్ లేని వినాయక్ ఈచిత్రంతో బంపర్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. సంక్రాంతి తర్వాత అంటే జనవరి చివరి వరాంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈచిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, రాహుల్దేవ్, ప్రదీప్రావత్, సుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కెమెరా: ఛోటా కె.నాయుడు, ఆర్ట్: ఆనంద్సాయి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వినాయక్.