Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- News మెగాస్టార్ అనూహ్య నిర్ణయం
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
తల్లిని ద్వేషించే పాత్రలో నయనతార అదుర్స్
నయనతార మలయాళంలో రీసెంట్ గా చేసిన 'ఎలక్ట్రా" చిత్రంలో ఆమె తన తల్లిని ద్వేషించే పాత్రను చేస్తోంది. ఆ పాత్ర సినిమాకే హైలెట్ అని అంతటా వినపడుతోంది. ఇఫి అంతర్జాతీయ చిత్రోత్సవాలు తో సహా పలు ఫిల్మోత్సవాల్లో ఈ సినిమా ఇప్పటికే ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా గురించి నయనతార మాట్లాడుతూ..అలెగ్జాండ్రా అనే గ్రీక్ డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 'ఎలక్ట్రా"లో నా పాత్ర చాలా న్యూచురల్ గా ఉంటుంది. నా తల్లి డయానాగా మనీషా నటించింది. తల్లిని ద్వేషించే కూతురు పాత్రలో నేను సరికొత్త గా కనిపిస్తారు. సినిమాలో కనిపంచే భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి అంటోంది.
జాతీయ అవార్డ్ గ్రహీత శ్యాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మేకప్ లేకుండా నటిస్తోంది.ఈ పాత్ర గురించి చెబుతూ - "ఎలక్ట్రా కోసం నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నా. ఇప్పటివరకు నేను నటించినవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. పెద్ద సినిమాల్లో నటించినప్పుడు పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ చిన్న బడ్జెట్ చిత్రాల్లో చేసినప్పుడు నటనకు స్కోప్ ఉంటుంది. వరుసగా ఇలాంటి సినిమాలే కాకపోయినా అడపా దడపా ఇలాంటివి చేయడంవల్ల ప్రతిభ వెలికి వస్తుంది. ఆ కారణంతోనే 'ఎలక్ట్రా' సినిమాని అంగీకరించాను. నటిగా నా సత్తా నిరూపించే చిత్రం ఇది' అంటోంది నయనతార.
ఇక ఈ చిత్రానికి శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులుగా కనిపించే ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజవుతుంది. ఇక నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన బాపు దర్శకత్వంలో శ్రీరామ రాజ్యం చిత్రంలో సీతగా చేస్తోంది.