twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తల్లిని ద్వేషించే పాత్రలో నయనతార అదుర్స్

    By Srikanya
    |

    నయనతార మలయాళంలో రీసెంట్ గా చేసిన 'ఎలక్ట్రా" చిత్రంలో ఆమె తన తల్లిని ద్వేషించే పాత్రను చేస్తోంది. ఆ పాత్ర సినిమాకే హైలెట్ అని అంతటా వినపడుతోంది. ఇఫి అంతర్జాతీయ చిత్రోత్సవాలు తో సహా పలు ఫిల్మోత్సవాల్లో ఈ సినిమా ఇప్పటికే ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా గురించి నయనతార మాట్లాడుతూ..అలెగ్జాండ్రా అనే గ్రీక్ డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 'ఎలక్ట్రా"లో నా పాత్ర చాలా న్యూచురల్ గా ఉంటుంది. నా తల్లి డయానాగా మనీషా నటించింది. తల్లిని ద్వేషించే కూతురు పాత్రలో నేను సరికొత్త గా కనిపిస్తారు. సినిమాలో కనిపంచే భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి అంటోంది.

    జాతీయ అవార్డ్‌ గ్రహీత శ్యాంప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మేకప్‌ లేకుండా నటిస్తోంది.ఈ పాత్ర గురించి చెబుతూ - "ఎలక్ట్రా కోసం నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నా. ఇప్పటివరకు నేను నటించినవన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. పెద్ద సినిమాల్లో నటించినప్పుడు పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో చేసినప్పుడు నటనకు స్కోప్‌ ఉంటుంది. వరుసగా ఇలాంటి సినిమాలే కాకపోయినా అడపా దడపా ఇలాంటివి చేయడంవల్ల ప్రతిభ వెలికి వస్తుంది. ఆ కారణంతోనే 'ఎలక్ట్రా' సినిమాని అంగీకరించాను. నటిగా నా సత్తా నిరూపించే చిత్రం ఇది' అంటోంది నయనతార.

    ఇక ఈ చిత్రానికి శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులుగా కనిపించే ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజవుతుంది. ఇక నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన బాపు దర్శకత్వంలో శ్రీరామ రాజ్యం చిత్రంలో సీతగా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X