వెంకటేష్ కి జోడిగా నయనతార మరోసారి...
'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా తన శైలి చాటుకొన్నారు మారుతి. ఇప్పుడు అల్లు శిరీష్, రెజీనాలను 'కొత్తజంట'గా చూపించబోతున్నారు. ఆతరవాత ఆయన వెంకటేష్తో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి 'రాధ' అనే పేరు కూడా పెట్టారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు.
'కొత్తజంట' పనులు చూసుకొంటూనే మరోవైపు 'రాధ' స్క్రిప్టుపైనా దృష్టి పెట్టారు మారుతి. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్స్ కోసం కసరత్తులు జరుపుతున్నారు. చాలామంది పేర్లు పరిశీలించిన తరవాత నయనతారని ఖరారు చేసినట్టు సమాచారం.
ఇక వెంకటేష్ నటించిన 'మసాలా' తుది మెరుగులు దిద్దుకొంటోంది. నవంబరు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరవాత 'రాధ' కబుర్లు తెలిసే అవకాశం ఉంది. 2014 సంక్రాంతి రోజున 'రాధ'ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేసిన యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












