twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబాయ్ తోనూ నయనతార

    By Staff
    |

    Nayantara
    ఓ ప్రక్క అబ్బాయి ఎన్టీఆర్ తో అదుర్స్ లో చేస్తున్న నయనతార తాజాగా బాబాయ్ బాలకృష్ణ తోనూ కమిటయ్యింది. బి.గోపాల్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించనున్న చిత్రంలో ఈ జంట ప్రేక్షకులను అలరించనుంది. ఇంతకుముందు ఇలా బాబాయ్..అబ్బాయిలతో సినిమా చేసిన హీరోయిన్ గా ఘనత ప్రియమణిదే. ఎన్టీఆర్ తో యమదొంగ చేసి, హరేరామ్ లో కళ్యాణ్ రామ్ తోనూ, ఆ తర్వాత మిత్రుడులో బాలయ్యతో చేసింది. అలాగే సిమ్రాన్..సైతం బాలయ్య ప్రక్కన చేసి ఆ తర్వాత విజయదశమి చిత్రంలో కళ్యాణరామ్ తో చిందులేసింది. ఇక రమ్యకృష్ణ అయితే సింహాద్రి అప్పుడే అబ్బాయి ప్రక్కన చేరింది. భైరవ ద్వీపంలో చేసిన రంభ ఆ తర్వాత యమదొంగలో అదరకొట్టింది.

    గతంలో బాలకృష్ణ కాంబినేషన్లో బి.గోపాల్ ఇచ్చిన హిట్స్ 'లారీ డ్రైవర్', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిస్తోంది. అలాగే బి.గోపాల్ సైతం ఎలైగైనా మరో హిట్ తో తన కెరిర్ కి సైతం ఊపునివ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంభంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ కొత్త చిత్రంపై భారీ పెట్టుబడిపెట్టనున్నట్లు చెప్తున్నారు. అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో తమ కొత్త చిత్రం ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. మస్కా ఫ్లాఫ్ తర్వాత బి.గోపాల్ చేస్తున్న చిత్రం కావటంతో అంచనాలు మధ్యస్ధంగా ఉన్నాయి. నయనతార ప్రస్తుతం రవితేజతో ఆంజనేయులు చిత్రంలో చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X