twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్మెస్ రాజుని నయనతార...

    By Staff
    |

    Nayantara
    నయనతార అయినా ఎమ్.ఎస్.రాజుని వరస ఫ్లాఫులనుంచి రక్షిస్తుందా అనేదే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన తన ఆస్ధాన దర్శకుడు కోడి రామకృష్ణతో కలసి ఓ భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తూ హీరోయిన్ గా నయనతారను ఎంచుకున్నారు. నయనతార అప్పట్లో చేసిన చంద్రముఖి ఎఫెక్టు దానికి కొంత కారణమంటున్నారు. అందులోనూ కోడి రామకృష్ణ తాజా చిత్రం అరుంధతి అన్ని రికార్డులనూ బ్రద్దలు కొడుతూ భాక్సాఫీస్ ని షేక్ చేయటం ఆయన్ని ఈ పనికి ఉసిగొల్పింది.

    అర్జెటుగా ట్రెండు తగినట్లుగా ఓ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రేక్షకులకు అందించి క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్నారు. మరో ప్రక్క తమిళంలో ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కష్టాలు పాలైన నయనతార తెలుగులోనయినా ఏదో విధంగా పూర్తి స్ధాయిలో తన స్ధానాన్ని పదిలపరుచుకునే ఆలోచనలో ఉంది. అందుకోసమే ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రం ఒప్పుకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక గతంలో కోడిరామకృష్ణ శత్రవు, దేవి అంటూ రాజుగారు కి హిట్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే పాజిటివ్ గానే కనపడుతోంది అంటున్నారు తలపండిన వారు. చూద్దాం ఈ సారి నయనతారైనా ఆయన్ని రక్షిస్తుందేమో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X