twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారపై బ్యాన్ మొదలు

    By Staff
    |

    Nayantara
    మొత్తానికి అనుకున్నంతా అయ్యింది. నయనతారపై తమిళ పిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బ్యాన్ వేటు వేసింది. అంతేకాక తెలుగు నిర్మాతల మండలిని సైతం ఆమెను తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపించింది. ఆమె రన్, పందెంకోడి చిత్రాల దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో పయ్యా చిత్రం కోసం ఇచ్చిన డేట్స్, రెమ్యునేషన్ విషయంలో వివాదాలు చెలరేగటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియచేస్తున్నారు.

    వరసగా నయనతార చిత్రాలు భాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవటంతో ఈ వివాదం ప్రారంభమయింది. లింగు స్వామి తన సొంత ప్రొడక్షన్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కి ఆమెను రెమ్యునేషన్ తగ్గించుకోమని అడిగారు. ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆమెను తప్పుకోమని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని అడిగారు. ఆమె దానికి ఒప్పుకోకపోవటంతో ఈ సమస్య వచ్చింది.అయితే నయనతార ఆ చిత్రం నిమిత్తం తాను కేటాయించిన డేట్స్ ని ఉపయోగించుకోలేదని, దాంతో ఆ రోజులన్నీ తాను ఖాళీగా ఉన్నానని,ఆ అడ్వాన్స్ కీ, డేట్స్ కీ చెల్లు అనీ చెప్తోంది. ఇక ప్రస్తుతం నయనతార ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ సినిమాలో చేస్తోంది. మరి ఈ బ్యాన్ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో భవిష్యత్ తేల్చాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X