Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
విరుచుకుపడ్డ నయనతార
ఎంతసేపూ హీరోలేనా..యేం..మేం కనపడమా అంటూ నయనతార విరుచుకుపడుతోంది. హీరోలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి కథలు రాసుకుంటున్న దర్శకులను ఆమె తీవ్రంగా ప్రశ్నిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిపోయాయి అన్నదానికి సమాదానంగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అంతేగాక ఇది పురుషాధిక్య పరిశ్రమ. అందుకే కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి. ఆ కథలో అన్నీ వారికే. మాలాంటి హీరోయిన్స్ కేవలం పావులు మాత్రమే అంటూ ఆవేదన చెందుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మాకూ చేయాలని ఉంటుంది.కానీ అలాంటి కథలు రచయితలు రాయాలి. రాసినా మా వరకూ రావాలి. వచ్చినా.. రిజల్ట్ ఎలా ఉంటుందో అనే బెంగ.. అంటూ చెబుతోంది. అలాగే ఎప్పుడో ఇలాంటి సినిమాలు వస్తాయిని ఎదురుచూడక..అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది అంటూ కొత్త వారికి సలహా ఇస్తోంది. అయితే ఛార్మి వంటి వారు వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కదా అన్నది ఆమెకి తెలియదా అంటున్నారు అది విన్నవారు.