నయనతార ఐటం...ఇక అందాల విందే!(ఫోటోలు)
చెన్నై : తన హాట్ అండ్ సెక్సీ అందాలతో...ఆకట్టుకునే అభినయంతో ఎందరినో తనకు అభిమానులుగా మార్చకున్న నయనతారకు సౌత్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సౌత్లో ఆ మధ్య కొంత కాలం నెం.1 హీరోయిన్గా వెలుగొందింది. ప్రభుదేవాతో ప్రేమాయణం నేపథ్యంలో సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్న నయన అతనితో వచ్చిన విభేదాలతో విడిపోయి...మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించని నయన...అజిత్ సరసన వాలాయ్, ఏఆర్ మురుగదాస్ నిర్మాణంలో వస్తున్న రాజారాణి, మరికొన్ని తమిళం, తెలుగు సినిమాల్లో చేస్తోంది. ఇంకా చాలా అవకాశాలు వస్తున్నా డేట్స్ అడ్జెస్ట్ కాక కొన్ని, కథలు నచ్చక మరికొన్ని వదులుకోవాల్సి వస్తోంది.
తాజాగా అందిన ఆసక్తికర సమాచరం ఏమిటంటే....నయనతార ఓ తమిళ సినిమాలో ఐటం సాంగు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధనుష్ నిర్మిస్తున్న 'ఎతిర్ నీచల్' అనే తమిళ సినిమాలో ఆమె ఈ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు స్లైడ్ షోలో...

ఈ చిత్ర దర్శకుడు దురై సేతికుమార్ మీడియాతో మాట్లాడుతూ...ఇదొక సూప్ నెంబర్ సాంగ్, కొలవెరి ఢీ సాంగు తరహాలో లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు.

‘సతియమా నీ...' అనే లిరిక్ తో ఈ సాంగ్ మొదలవుతుందని, ఈ పాటలో నయనతార, ధనుష్, శివకార్తికేయన్ కూడా కనిపించనున్నారని తెలిపారు.

తొలుత ఈ సాంగును కేవలం ధనుష్ తోనే చేయాలని అనుకున్నారు..అయితే ఎవరైనా హీరోయిన్ కూడా ఉంటే కలర్ ఫుల్ గా ఉంటుందనే భావనతో నయనతారను అప్రోచ్ అయ్యారు.

అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగుకు బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేసారు. ప్రేక్షకులను ఈ సాంగు బాగా మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు దర్శకుడు.

‘ఎతిర్ నీచల్' చిత్రంలో శివకార్తికేయన్, ప్రియా ఆనంద్, నందిత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











