Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకిచ్చే రెమ్యునేషన్స్: అనూష్క,నయనతార
హైదరాబాద్ : వెండితెరపై నటన, అందాలు ఒలకబోయడం మాత్రమే కాదు రెమ్యునేషన్ విషయంలోనూ హీరోయిన్స్ పోటీ పడి షాకిస్తున్నారు. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు...నయనతార, అనూష్క. వీరిని తమ సినిమాలో తీసుకోవాలంటే దాదాపు రెండు కోట్లు వరకూ ఇచ్చుకోవాల్సి వస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. అయితే తమిళ,తెలుగు భాషలు రెండింటిలోనూ వారికున్న డిమాండ్ ఓ రేంజ్ లో ఉండటంతో అలాగే కమిటైపోతున్నారు.
'రెండు' చిత్రంతో కోలీవుడ్కు పరిచయమైన అనుష్క ఆశించిన స్థాయిలో తమిళంలో రాణించలేకపోయింది. ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్యలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. కోటి రూపాయలు అడిగి ఇక్కడి నిర్మాతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిన్నటి వరకు ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్న అనుష్క తాజాగా మరో కోటి పెంచినట్లు సమాచారం.
తెలుగులో తెరకెక్కుతున్న 'రాణీ రుద్రమ' కోసం అమ్మడు రూ.2 కోట్లు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలోనూ అదేస్థాయిలో డిమాండ్ చేస్తోందట. నయనతార కూడా అదే బాటలో పయనిస్తోంది.
ప్రేమ వ్యవహారం నుంచి బయటపడిన తర్వాత నయనతారకు అవకాశాలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. అజిత్తో 'వలై', ఆర్య సరసన 'రాజా రాణి' చేస్తోంది. వీటికి రూ.కోటికన్నా ఎక్కువగానే అందుకున్నట్లు సమాచారం. విద్యాబాలన్ నటించిన 'కహాని' తమిళ, తెలుగు రీమేక్లలో నటించేందుకు రూ.2 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. మొదట్లో ససేమిరా అన్న నిర్మాత చివర్లో అంగీకరించినట్లు తెలుస్తోంది.