Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
షాకిచ్చే రెమ్యునేషన్స్: అనూష్క,నయనతార
హైదరాబాద్ : వెండితెరపై నటన, అందాలు ఒలకబోయడం మాత్రమే కాదు రెమ్యునేషన్ విషయంలోనూ హీరోయిన్స్ పోటీ పడి షాకిస్తున్నారు. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు...నయనతార, అనూష్క. వీరిని తమ సినిమాలో తీసుకోవాలంటే దాదాపు రెండు కోట్లు వరకూ ఇచ్చుకోవాల్సి వస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. అయితే తమిళ,తెలుగు భాషలు రెండింటిలోనూ వారికున్న డిమాండ్ ఓ రేంజ్ లో ఉండటంతో అలాగే కమిటైపోతున్నారు.
'రెండు' చిత్రంతో కోలీవుడ్కు పరిచయమైన అనుష్క ఆశించిన స్థాయిలో తమిళంలో రాణించలేకపోయింది. ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్యలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. కోటి రూపాయలు అడిగి ఇక్కడి నిర్మాతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిన్నటి వరకు ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్న అనుష్క తాజాగా మరో కోటి పెంచినట్లు సమాచారం.
తెలుగులో తెరకెక్కుతున్న 'రాణీ రుద్రమ' కోసం అమ్మడు రూ.2 కోట్లు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలోనూ అదేస్థాయిలో డిమాండ్ చేస్తోందట. నయనతార కూడా అదే బాటలో పయనిస్తోంది.
ప్రేమ వ్యవహారం నుంచి బయటపడిన తర్వాత నయనతారకు అవకాశాలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. అజిత్తో 'వలై', ఆర్య సరసన 'రాజా రాణి' చేస్తోంది. వీటికి రూ.కోటికన్నా ఎక్కువగానే అందుకున్నట్లు సమాచారం. విద్యాబాలన్ నటించిన 'కహాని' తమిళ, తెలుగు రీమేక్లలో నటించేందుకు రూ.2 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. మొదట్లో ససేమిరా అన్న నిర్మాత చివర్లో అంగీకరించినట్లు తెలుస్తోంది.