Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార పబ్లిసిటీ స్టంట్, ఆర్యతో పెళ్లి వార్త ఉత్తిదే!
హైదరాబాద్ : హీరోయిన్ నయనతార, తమిళ హీరో ఆర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు శుక్రవారం సాయంత్రం టీవీ ఛానళ్లలో, మీడియాలో హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం స్వయంగా నయనతార పీఆర్వో ద్వారా బయటకు రావడంతో అంతా నిజమే అని నమ్మారు. కొందరికి ఈ- వెడ్డింగ్ కార్డుతో సహా ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అందులో శనివారం రాత్రి 9 గంటలకు పెళ్లి అని స్పష్టంగా రాసి ఉంది.
తాజాగా ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది. ప్రస్తుతం నయనతార-ఆర్య 'రాజా రాణి' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే ఇలా చేసారట. ఈ మేరకు చిత్ర దర్శకుడు మీడియాకు క్షమాపణ చెప్పి మీడియాకు మెయిల్స్ పంపాడు.
అయితే ఈ విషయం తనకు తెలియదని, తనకు తెలిస్తే ఇలాంటి వాటికి ఒప్పుకునే దాన్ని కాదని నయనతార అంటోంది. ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచన లేదని, ప్రస్తుతం కెరీర్ మీదనే పూర్తి దృష్టి పెట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. కాగా....ఈ వ్యవహారంపై మీడియా వర్గాలు మండి పడుతున్నాయి. మీడియాతో ఆటలా? మీ పబ్లిసిటీ కోసం మీడియాను వాడుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలాంటి జిమ్మిక్కులు వాడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.