Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘కహానీ’ గుట్టు విప్పిన నయనతార
'బాలీవుడ్ మూవీ కహానీ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రానికి నేను సంతకం చేసారు. ఈచిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ నయనతార చెప్పిన విషయాన్ని చెన్నయ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నయనతార ఈ విషయాన్ని ఇలా అధికారికంగా ప్రకటించడంతో 'కహానీ' చిత్రంపై ఉన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.
వాస్తవానికి ఈచిత్రంలో తొలుత అనుష్క పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నయనతార పేరు కూడా వినిపించింది. తర్జన భర్జనల అనంతరం నయనతార పేరు ఫైనల్ అయింది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించబోతున్నారు. ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.
ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల పిటిఐతో మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ కు సంబంధించిన స్క్రిప్టు వర్క్ మలి దశలో ఉందని, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.