twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య సినిమాలో మా ఆవిడ వద్దంది

    By Bojja Kumar
    |

    నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీరామ రాజ్యం'. ఈచిత్రంలో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన 100 రోజుల వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన సతీమణి, దివంగత అన్నపూర్ణ జ్ఞాపకాలను గుర్తు చేసున్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామ రాజ్యం' సినిమాలో నేను వాల్మీకి పాత్ర చేస్తానంటే అన్నపూర్ణ తొలుత వద్దంది. అయితే రామాయణం మొత్తానికి వాల్మీకి హీరో కాబట్టి నేను ఎలాగైనా ఆ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. నేను, నాగార్జున కలిసి ఆమెను ఒప్పించాం అని చెప్పుకొచ్చారు.

    తను పోషించిన రాముడి పాత్ర గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ పాత్ర చేస్తున్నప్పుడు నాన్న గారితో పోటీ పడ్డట్లు అనిపించింది. నాన్న గారికి ఎంతో పేరు తెచ్చి పెట్టిన రాముడి పాత్రను చేయడం నా అదృష్ణం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాపు, మురళీ మోహన్, నిర్మాత సాయిబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గతంలో శ్రీరామ రాజ్యం సినిమాకు సంబంధించిన అన్ని వేడుకలకు క్రమం తప్పకుండా హాజరైన నయన తార ఈ వేడుకలో మాత్రం కనిపించలేదు. ఈ చిత్రంలో నయనతార పోషించిన సీత పాత్రకు అందరి కంటే ఎక్కువ మార్కలు పడ్డ విషయం తెలిసిందే.

    English summary
    ANR recalled that his late wife did not want him to act in SRR as she wanted him to be by her side in what turned out to be her last days. But ANR said that he believed that Valmiki was the true hero of Ramayana and he wanted to act in the role in this phase of his career. Many people were seen trying to suppress tears.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X