Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బాలయ్య సినిమాలో మా ఆవిడ వద్దంది
నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీరామ రాజ్యం'. ఈచిత్రంలో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన 100 రోజుల వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తన సతీమణి, దివంగత అన్నపూర్ణ జ్ఞాపకాలను గుర్తు చేసున్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామ రాజ్యం' సినిమాలో నేను వాల్మీకి పాత్ర చేస్తానంటే అన్నపూర్ణ తొలుత వద్దంది. అయితే రామాయణం మొత్తానికి వాల్మీకి హీరో కాబట్టి నేను ఎలాగైనా ఆ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. నేను, నాగార్జున కలిసి ఆమెను ఒప్పించాం అని చెప్పుకొచ్చారు.
తను పోషించిన రాముడి పాత్ర గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ పాత్ర చేస్తున్నప్పుడు నాన్న గారితో పోటీ పడ్డట్లు అనిపించింది. నాన్న గారికి ఎంతో పేరు తెచ్చి పెట్టిన రాముడి పాత్రను చేయడం నా అదృష్ణం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాపు, మురళీ మోహన్, నిర్మాత సాయిబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గతంలో శ్రీరామ రాజ్యం సినిమాకు సంబంధించిన అన్ని వేడుకలకు క్రమం తప్పకుండా హాజరైన నయన తార ఈ వేడుకలో మాత్రం కనిపించలేదు. ఈ చిత్రంలో నయనతార పోషించిన సీత పాత్రకు అందరి కంటే ఎక్కువ మార్కలు పడ్డ విషయం తెలిసిందే.