కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ దర్శకత్వంలో సినిమాని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రారంభం అయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14నుండి ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రియమణి హీరోయిన్ గా చేయబోయే ఈ చిత్రం మే 2009 లో రిలీజ్ చెయ్యాలని యోచిస్తున్నారు. సామాజిక సందేశం తోపాటు యాక్షన్ సన్నివేశాలకు కూడా ఈ సినిమాలో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి కథను బి.వి.యన్.రవి అందిస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి శిష్యుడు మహదేవన్ రూపొందించే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.