twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, బాపుల 'శ్రీరామ రాజ్యం' చిత్రం విడుదల తేదీ ఫిక్స్

    By Srikanya
    |

    నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశ కంటే గొప్పగా శ్రీరామ రాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి..అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అన్నారు.

    అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార చేస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X