మిస్సమ్మ, షో వంటి చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు నీలకంఠ మిస్టర్ మేధావి తర్వాత ఏ ప్రాజెక్టు ప్రారంభించలేదు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ ఆయన బిజీగా ఉన్నారు. వెంకటేష్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న ఎ వెడ్నస్ డే రీమేక్ కి ఆయన డైలాగులు రాస్తున్నారు. ఎలాగయినా ఈ చిత్రం హిట్ కొట్టాలనే తలంపుతో ఆయన రాత్రింబవళ్ళు రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నట్లు సమాచారం. కమల్ ప్రత్యేకంగా పిలిచి ఈ ఆఫర్ ఇవ్వటంతో ఎట్లా అయినా సద్వినియోగం చేసుకుని లైమ్ లైట్ లోకి రావాలని నీలకంఠ ఆశిస్తున్నారు.ఇక ఈ చిత్రం అనంతరం నీలకంఠ ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనాడు పేరుతో తయారయ్యే ఈ చిత్రం చక్రి(సాగరసంగమం భంగిమ కుర్రాడు)దర్శకత్వంలో రెడీ అవుతోంది.