twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేనింతే' లో నీతూ చంద్ర?

    By Staff
    |

    Neethu Chandra
    గోదావరిలో సుమంత్ మరదలుగా నటించిన అమ్మాయి గుర్తుందా? . ఆమె ఇప్పుడు పూరీ నెక్ట్స్ వెంచర్ 'నేనింతే' లో రవితేజ కి జంటగా మళ్ళీ పలకరించచబోతోందిట. ఈ వార్త బయిటకు గుప్పుమనగానే ఒక్కసారిగా అందరి కళ్ళూ ఆమె మీద పడ్డాయి. సాధారణంగా పూరీ సినిమాల్లో హీరోయిన్లు అందరిలా ఉండరు. కొంచెం ఉప్పూ కొంచెం కారం,కొంత వగరు...లాగా...కొద్దిగా తెలివి...కొంత తింగరితనం (సినిమా భాషలో అమాయకత్వం)...మరి కొంత పొగరు కలగలసి విచిత్రంగా బిహేవ్ చేస్తూంటారు. అన్నిటిని మించి అందాల ప్రదర్శనలో ముందుంటారు. కాబట్టి నీతూ లో కూడా ఆ లక్షణాలు కనపడ్డాయేమో అని అందరూ ఆమె సినిమాలు చూస్తూ వెతుకుతున్నారు. దూర దృష్టి మరీ ఎక్కువైన మరి కొంత మందైతే రేపు ఆమె పెద్ద హీరోయిన్ అయ్యే లోగా ఇప్పుడే అడ్వాన్స్ కొట్టి డేట్స్ పట్టేస్తే ఎలా ఉంటుందా అని దీర్ఘాలోచనలో పడుతున్నారు.

    నిజానికి నీతూచంద్ర తక్కువదేమీ కాదు. కాలం కలసి రాలేదంతే. ఆమె మంచి కథక్ డాన్సర్ . అంతేగాక మార్షిల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాథించిన సాహసి. తెరంగ్రేటం కూడా బాలీవుడ్ లో మథుభండార్కర్ 'ట్రాఫిక్ సిగ్నల్' తో జరిగింది.తరువాత 123,గరంమసాళా చిత్రాలలో చేసింది. కాని ఎందుకో రావల్సినంత పేరు, అవకాశాలు రాలేదు. తెలుగులో 'విష్ణు,గోదావరి' సినిమాలు చేసింది. కాని ఇక్కడా హిస్టరీ రిపీటయ్యింది. ఎవరూ పట్టించుకోలేదు. అలా కెరీర్ కదలకపోవడంతో కలత చెందిన నీతూ పూరీ సినిమా వచ్చిందంటే షాకయిపోయిందిట.ప్రెండ్సందరికీ పేరు పేరునా పలకరించి పార్టీ చేసినంత హడావిడి చేసిందిట.ఎందుకంటే పూరీ సినిమాలో నటిస్తే ఇలియానాలా వెలిగిపోవచ్చు,హన్సికా లా డిమాండున్న హీరోయిన్ కావచ్చు.అంతేకాక సెవన్ సీస్ టెక్నాలిజీస్ వారు రూపొందిస్తున్న నీతు-ది ఎలియన్ కిల్లర్ అనే 3డి మొబైల్ గేమ్ అనే కొత్త ఫార్మెట్ ఆమెతోనే ఫ్రారంభం కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X