Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుమంత్ హీరోయిన్..స్వలింగ సంపర్కం
సుమంత్ సరసన గోదావరి చిత్రంలో చేసిన నీతూ చంద్ర తాజాగా ఓ చిత్రం డైరక్ట్ చేయబోతున్నారు. అయితే అందులో స్పెషల్ ఏమిటంటే ఆ చిత్రం స్వలింగ సంపర్కం నేపథ్యం. పూర్తిగా అదే కథతో సినిమా తెరకెక్కించటానికి స్క్ర్రిప్టు రెడీ చేసింది.ఈ విషయం తెలిసిన బాలీవుడ్ మీడియా ఒక్కసారిగా షాకై ఆమెపై ప్రశ్నలు వర్షం కురిపించింది. అయినా మొదటి సారి మెగాఫోన్ పట్టుకోబోతూ ఇలాంటి కథను ఎన్నుకున్నావెందుకు అని నిలదీసింది. దానికి నీతూచంద్ర కూల్ గా...ఏం ఆ మ్యాటర్ సినిమా తీయటానికి పనికివచ్చేది కాదా..వారు మాత్రం మనుషులు కారా అంది.
దాంతో మొన్నామధ్య లెస్బియన్ ఫొటోసెషన్ లో పాలుపంచుకున్న ఆమెకు అన్నీ ఇలాంటి ఆలోచనలేవస్తున్నాయని బాలీవుడ్ మీడియా మాట్లాడటం మొదలెట్టింది.దాంతో మరోసారి నీతూచంద్ర..నా టాలెంట్ గురించి నాకు తెలుసు. ఎలాంటి ప్రయోగాత్మక పాత్రనైనా చేసే కెపాసిటీ ఉన్న నటిని నేను. కానీ నన్ను దర్శక, నిర్మాతలు పట్టించుకోవడంలేదు. నా టాలెంట్ని వాడుకోవడం లేదు. అందుకే... దర్శకత్వ బాధ్యతను చేపట్టాలనుకుంటున్నాను. ఆ విభాగంలో నాకు ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో కథ తయారు చేసుకున్నా. త్వరలోనే నా సినిమా సెట్స్కి వెళ్లనుంది"" అని చెప్పారు.