Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది పినిశెట్టి ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'నీవెవరో'. హరినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆదివారం విడుదల చేశారు.
'మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన' అంటూ హీరో ఆది చెప్పే డైలాగుతో మొదలైన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.
'ఇది ప్రమాదం కాదు సర్.. ఇది హత్య' అనే డైలాగ్స్ ఉండటం బట్టి ఈ మూవీ ఒక హత్యోదంతం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 'ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి' అంటూ ఆది పినిశెట్టి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
'వీడ్ని స్కెచ్ వేసి చంపింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్. కిమ్ అయినా.. ట్రంప్ అయినా లోపలేసి కుమ్ముతా' అంటూ వెన్నెల కిషోర్ ఫన్నీ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను నవ్విస్తాడని అర్థం చేసుకోవచ్చు. టీజర్పై మీరూ ఓ లుక్కేయండి మరి.