Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ నేహాకి చేదు అనుభవం: ఆక్సిడెంట్ అయితే సహాయం మరిచి, సెల్ఫీలు దిగారు
నేహా ధూపియా కారు యాక్సిడెంట్కు గురైంది. గుమిగూడిన జనం.. ప్రమాదం నుంచి ఆమెను రక్షించే బదులు ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు.
ప్రస్తుతం నడుస్తున్న సెల్ఫీల యుగంలో సమయమూ సందర్భమూ ఏదీ లేకుండా సెల్పీకి దిగుతున్నారు. గతం లో నటుడు ప్రకాశ్ రాజ్ కి, కమేడియన్, హీరో సునీల్ కీ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. తనని రక్షించటం పక్కకు ప్ర్ట్టి సెల్ లో తన ఫొటోలని తీస్తున్న జనాన్ని చూసి దిగ్బ్రాంతికి లోనయ్యాను అని ప్రకాశ్ రాజ్ చెబితే, ఒక పక్కరక్తం కారుతున్నా సెల్ఫీ తీజ్సుకోబోయిన వ్యక్తిని కసురుకొని అవతలికి తోలేసాడట సునీల్. ఇప్పుడు బాలీవుడ్ నటి, మన టాలీవుడ్ లో కూడా రాజ శేఖర్, బాల కృష్ణల సరసన హీరోయిన్ గా చేసిన నేహా దుపియా కి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యిందట.
బాలకృష్ణ సరసన ‘పరమవీరచక్ర'
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సరసన ‘పరమవీరచక్ర' సినిమాలో తళుక్కున మెరిసిన బాలీవుడ్ భామ నేహా ధూపియాకు ఇటీవల అభిమానుల నుంచి ఇటువంటి అనుభవం ఎదుదైంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేహా ధూపియా ప్రయాణిస్తున్న కారు.. చంఢీఘడ్లో యాక్సిడెంట్కు గురైంది. దీంతో అక్కడ గుమిగూడిన జనం.. ప్రమాదం నుంచి ఆమెను రక్షించే బదులు ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు.
Recommended Video
కళ్లద్దాలు పగిలిపోయాయి
వివరాల్లోకి వెళితే నేహా ఒక ఆడియో ఫంక్షన్ కోసం చండీఘడ్ వెళ్లారు. తిరిగివస్తున్న సమయంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం జరగడంతో ఆ రోడ్డు మీదుగా వెళుతున్న వాహనాలన్నీ అక్కడ నిలిచిపోయాయి. వారంతా తమ అభిమాన నటి నేహాను గుర్తుపట్టారు.
సహాయం చేయకుండా
అయితే వారు ఆమెకు సహాయం చేయడం పోయి.. ఆమెకు మరింతగా దగ్గరగా జరిగి సెల్పీలు, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో నేహాకు గాయాలు కాకపోయినప్పటికీ, అక్కడ గుమిగూడిన జనంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నేహా పిఆర్ఓ చెప్పిన వివరాల ప్రకారం నేహా ప్రయాణిస్తున్నకారు బ్రేకులు పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
సెల్ఫీలతో పాటు ఆటోగ్రాఫ్లు
దీంతో అరగంట పాటు నేహా.. జనం మధ్యలోనే ఉండిపోయి వారికి సెల్ఫీలతో పాటు ఆటోగ్రాఫ్లు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో కారు వచ్చాక ఊపిరి పీల్చుకుంటూ ఎయిర్ పోర్టుకు ప్రయాణమయ్యిందట పాపం నేహ. నిజంగా మనుషులు మరీ కౄరంగా మారిపోతూ, కనీస భావోద్వేగాలకూ దూరంగా జరిగిపోతున్నారన్నది వాస్తవమే అనిపించటంలేదూ...