Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
ప్రభాస్ మర్రి చెట్టి లాంటివాడు.. నా భార్య గర్భవతి అని తెలియగానే ఏంచేశాడంటే.. నీల్ నితిన్ ముఖేష్!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన నటుడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ దశదిశలా వ్యాపించింది. ప్రభాస్ గురించి తెలుసుకోవడానికి జాతీయ మీడియా సైతం ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలతో రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాహో చిత్ర సెట్స్ లో ప్రభాస్ తో జరిగిన అద్భుతమైన సంఘటనని నీల్ నితిన్ ముఖేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
సాహోలో కీలకమైన
భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న సాహోలో చాలా మంది బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. సాహూ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభాస్ పై నీల్ నితిన్ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసలతో ముంచెత్తాడు.
మర్రి చెట్టు లాంటివాడు
మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మనుషుల్లో కొందరు మర్రిచెట్టు లాంటివాళ్లు ఉంటారు అని. మర్రి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తిరిగి దాని ఊడలు భూమిమీదికి చేరుకుంటాయి. ప్రభాస్ కు ఇది బాగా సరిపోతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు.
నా భార్య గర్భవతి
చాలా రోజులపాటు సాహో చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరిగింది. ఆ సమయంలో నా భార్య గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటించాము. ఈ న్యూస్ తెలియగానే ప్రభాస్ స్వయంగా మా రూమ్ కు వచ్చాడు. తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసి భారీగా గిఫ్ట్స్ అందజేశాడు. ఆ విషయాన్ని తాను ఎప్పటికి మరచిపోలేనని నీల్ నితిన్ తెలిపాడు.
బడ్జెట్
దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మందిర బేడీ కీలక పాత్రలో నటిస్తోంది. ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సుజిత్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.