Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
పూరీ జగన్నాధ్ 'నేను... నా రాక్షసి' స్టోరీ లైన్ ఏమిటి
రాణా, ఇలియానా కాంబినేషన్ లో 'నేను... నా రాక్షసి' అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే..ఇలియానా కి మంచి అందం,తెలివి తేటలు ఉంటాయి.కానీ ఆమె ఆలోచనలు అన్నీ ఆత్మహత్య మీదే ఉంటాయి.ఎంత బాగా బతకాలి? అని ఆలోచించే వయసులో ఆ అమ్మాయి... ఎలా చనిపోవాలో ప్లాన్స్ వేసుకుంటూంటిది.ఈ లోగా ఆమెకు ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ తో పరిచయమైంది.ఆ తరవాత ఏం జరిగింది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ''కొత్త కథలు రావడం లేదు.. తీయడం లేదు... అని పదే పదే అంటుంటే తిక్కరేగి రాసిన కథ ఇది.
తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్యను శాశ్వత పరిష్కారంగా ఎంచుకొంటున్నారు. ఎక్కువ శాతం యువతరమే ఆత్మహత్యలకు పాల్పడుతోంది. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఓ రాక్షసిలాంటి అమ్మాయికీ, ఓ ప్రొఫెషనల్ కిల్లర్కీ మధ్య జరిగిన ప్రయాణం ఎలా ఉంటుందో తెర మీద చూడండి'' అన్నారు. ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్ రాథోడ్.